‘హిరణ్య కశ్యప’లో భాగమవుతున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్
2020-12-02 11:13:54
డైరెక్టర్ గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ 2022లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంలో టైటిల్ రోల్ను రానా దగ్గుబాటి పోషించనున్నాడు. నిజానికి 2020లోనే ఈ మూవీని మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు గుణశేఖర్, డి. సురేశ్బాబు భావించారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు అనివార్యంగా ఆ ప్రాజెక్టును వాయిదా వేయాల్సి వచ్చింది. కారణం.. దానికి వందలాది మంది యూనిట్ సభ్యులు ఒకచోట పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే 2020లో దాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈలోగా రానా మిగతా ప్రాజెక్టులను పూర్తి చేయనున్నాడు. మరోవైపు గుణశేఖర్ సైతం మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుని ప్రేమకథను ‘శాకుంతలం’ పేరుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 2021లో దాన్ని ఆయన సెట్స్ మీదకు తీసుకు వెళ్తున్నారు.
‘హిరణ్యకశ్యప’ మూవీని సురేశ్బాబుకు చెందిన సురేశ్ ప్రొడక్షన్స్, హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో, విజువల్ వండర్గా ఈ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా దీనికి పనిచేయనున్నట్లు సమాచారం.
More Stories
లక్ష్మీ మంచుకు ఆ సూపర్స్టార్ అంటే పిచ్చి ప్రేమ!
Vijay Deverakonda urges people of Hyderabad to vote, says vote for the peace and prosperity of our city – Times of India
రానా: సినిమాలు, ఓటీటీపై కాదు.. న్యూస్పై నియంత్రణ ఉండాలి!