అఫిషియల్: నాగశౌర్య-రీతు వర్మ జంటగా ‘వరుడు కావలెను’
అఫిషియల్: నాగశౌర్య-రీతు వర్మ జంటగా ‘వరుడు కావలెను’
2020-11-13 22:35:03
‘పెళ్లిచూపులు’ చిత్రంలో హీరోయిన్గా ప్రదర్శించిన అభినయంతో విమర్శకుల, ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న రీతూ వర్మ కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ను అందుకుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్కు సంతకం చేస్తూ వస్తున్న ఆమె, ఇటీవలే నాగశౌర్య జోడీగా ఓ సినిమాని అంగీకరించిన విషయం విదితమే.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి శుక్రవారం అఫిషియల్గా వరుడు కావలెను అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఓ అందమైన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో నాగశౌర్య, రీతూవర్మ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఈ గ్లింప్స్కు మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. గణేష్కుమార్ రావూరి సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.